అరుణా రాయ్
స్వరూపం

అరుణా రాయ్, (జననం 1946 జూన్ 26 ) ఈమె ఒక భారతీయ రాజకీయ కార్యకర్త, సామాజిక వేత్త. సమాచార హక్కు కోసం ఉద్యమం నడిపిన వ్య్హక్తి. సమాజంలోని బలహీన వర్గాల కోసం ఆమె కృషి చేసారు. ఆమె సోనియా గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు జాతీయ సలహా మండలిలో సభ్యురాలుగా చాలా కాలం పాటు కొనసాగారు.ఆమె నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ సంస్థకు అధ్యక్షురాలు.ఆమె కమ్యూనిటీ లీడర్షిప్ నకు గుర్తింపుగా 2000లో రామన్ మెగసెసే అవార్డును అందుకుంది.
వ్యాఖ్యలు
[మార్చు]- మహిళలు హక్కులని పొందాలంటే, ముందు మనమంతా కులం మతం, ప్రాంతం, భాష సామాజిక హోదా తదితర అంశాలపరంగా విడిపోకూడదు. అప్పుడే రాజకీయంగా, ఆర్ధికంగా, మన గొంతుని బలంగా వినిపించగలం[1]
- "అధికారాన్ని ప్రశ్నించడం ఒక పౌరుని హక్కు మాత్రమే కాదు – బాధ్యత కూడా."
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు . 2025-03-15
