చిన్మయి కుమార్ ఘోష్
స్వరూపం

చిన్మోయ్ కుమార్ ఘోష్ (27 ఆగష్టు 1931 - 11 అక్టోబర్ 2007)ను, శ్రీ చిన్మోయ్ అని కూడా పిలుస్తారు. ఈయన 1964లో న్యూయార్క్ నగరానికి వెళ్లిన తర్వాత పశ్చిమ దేశాలలో ధ్యానం నేర్చిన భారతీయ ఆధ్యాత్మిక నాయకుడు. చిన్మోయ్ తన మొదటి ధ్యాన కేంద్రాన్ని న్యూయార్క్లోని క్వీన్స్లో స్థాపించారు. చివరికి 60 దేశాలలో 7,000 మంది విద్యార్థులను కలిగి ఉన్నాడు. ఫలవంతమైన రచయిత, కళాకారుడు, కవి, సంగీతకారుడు. అతను అంతర్గత శాంతి నేపథ్యంపై కచేరీలు, ధ్యానాలు వంటి బహిరంగ కార్యక్రమాలను కూడా నిర్వహించాడు. [1]
వ్యాఖ్యలు
[మార్చు]- దేనినీ తీర్పు చెప్పకండి, మీరు సంతోషంగా ఉంటారు. ప్రతిదీ క్షమించండి, మీరు సంతోషంగా ఉంటారు. ప్రతిదీ ప్రేమించండి, మీరు సంతోషంగా ఉంటారు.[2]
- నిరీక్షణ ముగిసినప్పుడు శాంతి ప్రారంభమవుతుంది.
- మీ ఆలోచనలలో నిజాయితీగా ఉండండి, మీ భావాలలో స్వచ్ఛంగా ఉండండి. మీరు ఆనందం కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆనందం మీ వెంట పరుగులు తీస్తుంది.
- నిశ్శబ్దం నిశ్శబ్దం కాదు. నిశ్శబ్దం మాట్లాడుతుంది. ఇది చాలా అనర్గళంగా మాట్లాడుతుంది. నిశ్శబ్దం ఆగడం లేదు. నిశ్శబ్దం దారితీస్తుంది. ఇది చాలా పర్ఫెక్ట్ గా లీడ్ చేస్తుంది.
- ఆశ, విశ్వాసం ఇద్దరు సన్నిహిత సోదరులు; వారు ఎల్లప్పుడూ కలిసి ఉంటారు. ఆశ విశ్వాసాన్ని పెంచుతుంది, విశ్వాసం ఆశను విలువైనదిగా భావిస్తుంది.
