చెరబండరాజు
స్వరూపం
చెరబండరాజు (1944 - జూలై 2, 1982) కలం పేరుతో దిగంబరకవులలో ఒకనిగా సుపరిచితమైన "బద్ధం భాస్కరరెడ్డి" ఆలోచన, అక్షరం, ఆచరణ ఏక రూపం దాల్చిన విప్లవ కవి, నవలా రచయిత, పాటల రచయిత. అతను ప్రపంచ పురోగతి సాంతం శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడివుందని గాఢంగా నమ్మిన వ్యక్తి. అతనికి మహాకవి శ్రీశ్రీ తన "మరోప్రస్థానం" కావ్యాన్ని అంకితమిచ్చాడు.
చెరబండరాజు ముఖ్యమైన వ్యాఖ్యలు
[మార్చు]- శివధనస్సు విరిగితేనే,రాముడు సీతకి మొగుడయ్యాడు. చేప పిల్లని చంపాకే; అర్జునునికి ద్రౌపది పెళ్లామయ్యింది. విధ్వంసాలే వివాహానికి పునాదులు.