జయప్రకాశ్ నారాయణ్
స్వరూపం

జె.పి.గా సుప్రసిద్దులైన జయప్రకాశ్ నారాయణ్ (జ:1902 అక్టోబరు 11 - మ:1979 అక్టోబరు 8) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు. 1970 వ దశకంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ చిరస్మరణీయుడయ్యాడు. ఇతనిని ప్రజలు లోక్ నాయక్ అని సగౌరవంగా పిలుచుకుంటారు. భారత ప్రభుత్వం ఇతని 113 వ జయంతిని పురస్కరించుకుని "ప్రజాస్వామ్య పరిరక్షణ దినం"గా ప్రకటించింది.
వ్యాఖ్యలు
[మార్చు]- “ప్రజల శక్తి గర్జించాలి; ప్రభుత్వాలు దాని ముందర నమించాలి.”[1]
- సమాజములో శాంతి లేకపోతే ప్రజాస్వామ్యానికి బలం ఉండదు. శాంతి ప్రజాస్వామ్యం రెండు ఒకే నాణెనికి రెండు పార్శ్వాలు. ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. [2]
