దాశరథి కృష్ణమాచార్య

వికీవ్యాఖ్య నుండి
(దాశరథి నుండి మళ్ళించబడింది)

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న గ్రామంలో జన్మించాడు. నిరంకుశ నిజాం పాలనను తన రచనల ద్వారా వెలిబుచ్చిన మహాకవి. 1987 నవంబర్ 5 న దాశరథి మరణించాడు.

దాశరథి యొక్క ముఖ్య కొటేషన్లు[మార్చు]

  • నా తెలంగాణ కోటి రతనాల వీణ.
  • ఓ నిజాము పిశాచమా, కానరాడు
    నిన్ను బోలిన రాజు మాకెన్నడేని.
  • మా నిజాము రాజు జన్మజన్మల బూజు
  • నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా.......
    గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతాం కొడుకా నైజాము సర్కరోడామూస:ఆధారం
  • నిన్ను గెలవాలేక రైతన్నా......
    నిజాం కూలింది కూలన్న
  • రజాకార్ల ఈ రాజ్యం ప్రజావళికి యమకూపం, మతదురహంకారానికి ఇదే నగ్న నిజరూపం[1]
  • ముసలి నక్కకు రాజరికంబు దక్కునే[2]
  • అబద్ధాలాడడమంత సులభం అవదు సుమూ! కవిత అల్లడం.[3]
  • ఫిరంగీల స్వరం వినని చరిత్రంటూ లేదు సుమా![4]
  • శవం బతకడం ఎంత విచిత్రమో, మనం మేలుకోవడమూ అంత విచిత్రమే.
సురవరం ప్రతాపరెడ్డి గురించి
  • పాత్రికేయుడో! అతడు, రాజకీయ దురంధరుడో! పండితుడో! వ్యాఖ్యతయో! అన్నీ ఒకటైనవాడో![5]

మూలాలు[మార్చు]

  1. ఆదిలాబాదు జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, పేజీ 67
  2. (నిజాం నవాబును విమర్శించుతూ చేసిన వ్యాఖ్య)స్వాతంత్ర్య సమర నిర్మాతలు, జి.వెంకటరావు, ఏ.పండరీనాథ్, 1994 ప్రచురణ, పేజీ 58
  3. దాశరథి కృష్ణమాచార్య:పునర్నవం,కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1961,పుట-36
  4. దాశరథి కృష్ణమాచార్య:పునర్నవం(రూపాయికి విలువలేని రోజు...),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1961,పుట-66
  5. దాశరథి కృష్ణమాచార్య:పునర్నవం(యశోరాశి),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1961,పుట-32


w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.