దుర్గాభాయిదెస్ముఖ్
స్వరూపం
దుర్గాబాయి దేశ్ముఖ్ (జూలై 15, 1909 - మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఆమె స్థాపించింది. ఆమె భారతదేశ రాజ్యాంగ సభ, భారతదేశ ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్పర్సన్గా వ్యవహరించింది.
వ్యాఖ్యలు
- పరిస్థితులకు బానిసలా మారొద్దు. వాటినే మనకు అనువుగా మార్చుకోవాలి. ప్రతి సమస్యని ఓపిగ్గా, సమర్థంగా ఎదుర్కొనడంపైనే మన విజయం ఆధారపడుతుంది.[1]
- సమాజ మార్పు కోసం మహిళా శక్తి ముందంజ వేయాలి; స్వాతంత్ర్యం అన్నది అందరికీ సమానంగా అందాలి[2]
మూలాలు