నందమూరి తారక రామారావు

వికీవ్యాఖ్య నుండి
(ఎన్టీఆర్ నుండి మళ్ళించబడింది)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు 1923, మే 28న కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో జన్మించాడు. 300పైగా చలన చిత్రాలలో నటించి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. 3 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1996, జనవరి 18న మరణించాru.

ఎన్టీ రామారావు యొక్క ముఖ్య వ్యాఖ్యలు[మార్చు]

  • అన్నం లేని దేశంలో ఆసియా క్రీడలా! [1]
  • తెలుగుదేశం పార్టీ నాతోనే వచ్చింది, నాతోనే పోతుంది.[2]
  • ఆరు లక్షల ఉద్యోగుల కోరికల కోసం ఆరు కోట్ల ప్రజల భవిష్యత్తును నాశనం చేయడానికి నేను మూర్ఖుడిని కాను.[3](ఉద్యోగుల సమ్మె సందర్భంగా ఎన్టీయార్ ఆవేశంతో అన్న మాటలు)
  • సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు

మూలాలు[మార్చు]

  1. 1982లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆసియా క్రీడలను నిర్వహించు సమయంలో ఎన్టీయార్ చేసిన విమర్శ
  2. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 180
  3. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 179
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.