కాళోజీ నారాయణరావు

వికీవ్యాఖ్య నుండి

కాళోజీ నారాయణరావు ప్రముఖ ప్రజాకవి. 1914 సెప్టెంబర్ 9న జన్మించాడు. వరంగల్ జిల్లా మడికొండ గ్రామం ఇతని స్వగ్రామం. నిజాం నిరంకుశపాలనను తన కవితల ద్వారా దుయ్యబట్టాడు. కాళోజీ 2002లో మరణించాడు.

కాళోజీ యొక్క ముఖ్య కొటేషన్లు[మార్చు]

  • ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక
  • పుట్టుక నీది-చావు నీది, బతుకంతా దేశానిది [1]
  • భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె
  • ఉదయం కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ
  • అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా[2](నిజాం కాలంలో తెలంగాణాలో తెలుగు భాషకు పట్టిన దుర్గతిపై కాళోజీ వ్యాఖ్య)
  • నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ......హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు.[3]
  • కండకండలుగా కోసి కాకులకు వేయాలె, కాలంబు రాగానె కాటేసి తీరాలె[4]
  • దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలై వెలిగేదెన్నాళ్ళు.

మూలాలు[మార్చు]

  1. జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజి చెప్పిన వ్యాఖ్య
  2. స్వాతంత్ర్య సమర నిర్మాతలు, జి.వెంకటరామారావు. ఏ.పండరినాథ్, 1994 ప్రచురణ,పేజీ 63
  3. నిజాం నిరంకుశ పాలనపై కాళోజీ వ్యాఖ్య
  4. నిజాం నిరంకుశ పాలనపై కాళోజీ వ్యాఖ్య
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.