బిపిన్ చంద్ర పాల్
స్వరూపం

బిపిన్ చంద్ర పాల్ (నవంబరు 7, 1858 – మే 20, 1932) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు. లాల్, బాల్, పాల్ త్రయంలో మూడవ వాడు. 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడాడు.[1]
వ్యాఖ్యలు
[మార్చు]- బిపిన్ చంద్ర పాల్ మాట్లాడుతూ, భారతదేశంలో కూడా విజృంభిస్తున్న ఈ పాన్-ఇస్లామిజం 'భారతీయ జాతీయవాదానికి దాని నిజమైన, విస్తృత అర్థంలో ఉమ్మడి శత్రువు' అని అభిప్రాయపడ్డారు.[2]
- విక్రమ్ సంపత్ - సావర్కర్, ఎకోస్ ఫ్రమ్ ఎ ఫర్గాటెన్ పాస్ట్, 1883–1924 (2019) లో ఉదహరించబడింది
- భారతీయ ముస్లిములు, మొదట ముస్లిములు, తరువాత భారతీయులు. సయ్యద్ అమీర్ అలీ వంటి ముస్లిం నాయకుల అభిప్రాయం ప్రకారం, విదేశీ ఇస్లామిక్ దేశాలు భారతదేశాన్ని ఆక్రమిస్తే, భారతదేశానికి వ్యతిరేకంగా ఆ ముస్లిం ఆక్రమణదారులకు సహాయం చేయడమే భారతీయ ముస్లింల విధులు, ఎందుకంటే వారికి 'ముస్లిం గుర్తింపు' చాలా ముఖ్యం.
- బిపిన్ చంద్ర పాల్ రచించిన 'రాష్ట్రనిధి', 'బిజయ', 1319 బంగబ్దా
- మనల్ని మనం సంస్కరించుకోవడం ప్రథమ కర్తవ్యం కావాలి కానీ, పొరుగువాణ్ణి సంస్కరించడం మన కర్తవ్యం కాదు. వ్యక్తిగత జీవితంలో అయినా. దేశంలో అయినా మన వైఫల్యాలకు కారణం మన మీద మనకి నమ్మకం లేకపోవడమే.[3]
- పక్కవారిని సంస్కరించడం మీద కాదు. ముందు మనల్ని మనం లోపరహితం చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి. మన మీద మనకు నమ్మకం లేకపోవడమే జీవితంలో అనేక వైఫల్యాలకు కారణం. [4]
- స్వాతంత్ర్యం కోసం భయాన్ని విడిచిపెట్టాలి; భయంతో బ్రతికేవాడు ఆజాదీని అర్హించడు[5]
- స్వేచ్ఛ కోసం పోరాటం అనేది ఒక పవిత్రమైన యజ్ఞం — అది భయం లేకుండా జరగాలి[6]
- స్వేచ్ఛ అనేది కేవలం రాజకీయ అధికారానికే పరిమితం కాదు. సామాజిక ఆర్థిక నైతిక స్వేచ్చలను ప్రతి పౌరుడు అనుభవిస్తున్నప్పుడే ఆ దేశం స్వతంత్రమైనది అవుతుంది.[7]
మూలాలు
[మార్చు]- ↑ https://te.wikipedia.org/wiki/బిపిన్_చంద్ర_పాల్
- ↑ https://en.wikiquote.org/wiki/Bipin_Chandra_Pal
- ↑ ఈనాడు.2024-11-07.
- ↑ ఈనాడు,మే 16,2025
- ↑ 1907లో స్వదేశీ ఉద్యమ ర్యాలీలో ఇచ్చిన ఉజ్జ్వల ఉపన్యాసంలో
- ↑ 1907లో కలకత్తాలో ఇచ్చిన స్వదేశీ ఉద్యమ ప్రసంగంలో
- ↑ ఈనాడు.2025-11-10
