రామకృష్ణ పరమహంస
స్వరూపం

రామకృష్ణ పరమహంస అసలు పేరు గధాధర్ ఛటోపాధ్యాయ. ఇతను ఫిబ్రవరి 18, 1836న జన్మించాడు. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం" లో ఈయన ప్రభావము చాలా ఉంది. ఆగష్టు 16, 1886న మరణించాడు.
- రామకృష్ణ పరమహంస యొక్క ముఖ్య వ్యాఖ్యలు
- కాయలు కాచిన చెట్టు కొమ్మలు వంగి వేలాడుతుంటాయి. గొప్పవాడివి కావాలనుకుంటే వినయంగా, నిరాడంబరంగా ఉండాలి.
- తీసుకోవడమే కాదు - ఇవ్వడం కూడా నేర్చుకో.
- జ్ఞానము ఏకత్వమునకు దారిజూపును; అజ్ఞానము భిన్నత్వమునకు త్రోవజూపును.
- సాధారణ ప్రజలు మతం గురించి ధర్మం గురించి చాల మాట్లాడతారు. ఆవగింజంత కూడా ఆచరణ ఉండదు. జ్ఞానులు తక్కువ మాట్లాడుతారు. కానీ ధర్మాన్ని ఆచరించి చూపుతారు . పవిత్ర గ్రంధాల్లోని మంచి మాటలను చదివినంత మాత్రాన ఎవరు గొప్పవారు కాదు . [1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు . 2025-02-19