Jump to content

విజయలక్ష్మి పండిట్

వికీవ్యాఖ్య నుండి
విజయలక్ష్మి పండిట్

విజయలక్ష్మి పండిట్ (1900 ఆగస్టు 18 - 1990 డిసెంబర్ 1) భారతీయ రాజకీయవేత్త, దౌత్య వేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి మోతీలాల్ నెహ్రూ. స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూ సోదరి. ఆమె మేనకోడలు ఇందిరా గాంధీ భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రి, ఆమె మనవడు రాజీవ్ గాంధీ భారతదేశ ఆరవ ప్రధానమంత్రి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధి గాంచింది. 1962 నుండి 1964 వరకు మహారాష్ట్ర గవర్నరుగా పనిచేసింది. ఆమె మహారాష్ట్ర 6వ గవర్నర్‌గా ఎన్నికైన మొదటి మహిళ, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి 8వ అధ్యక్షురాలు. 1921లో ఆమె చదువు పూర్తయిన తర్వాత రంజిత్ సీతారామ్ పండిట్ ను వివాహమాడింది. అప్పటి సంప్రదాయాల ప్రకారం ఆమె పేరును విజయలక్ష్మి పండిట్ గా మార్చడం జరిగింది.

వ్యాఖ్యలు

[మార్చు]
  • సుదూర గతంలో, అనేక ఇతర దేశాలలో వలె భారతదేశంలో, అన్ని గుర్తింపు పొందిన అభ్యాస శాఖలు మతపరమైన, తాత్విక పక్షపాతాన్ని కలిగి ఉన్నాయి. విద్య కేవలం జీవనోపాధికి సాధనం లేదా సంపదను సంపాదించడానికి సాధనం కాదు. ఇది ఆత్మ జీవితంలోకి ఒక దీక్ష, సత్యం, ధర్మం సాధనలో మానవ ఆత్మకు శిక్షణ.
  • "కవిత్వం గిరిజనురాలికీ ఓ ఆయుధం – అది అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నించాలి."
    • ది ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా (1958), p. 19.
  • శాంతి సమయంలో మనం ఎంత ఎక్కువగా చెమటను చిందిస్తే . . . యుధ్ధ సమయంలో అంత తక్కువగా రక్తాన్ని చిందిస్తాం.[1]
  • అవరోధాలు, వ్యతిరేకత, విమర్శ ...ఇవన్నీ అధిగమించాల్సిన విషయాలు. వాటిని గెలిచి ముందుకెళ్లినప్పుడు లభించే ఆనందమే వేరు. అవేవీ లేకుండా కేవలం ప్రశంసలే లభిస్తే ఆ జీవితంలో మజా ఉండదు. ఏం చేయాలో కూడా తెలియదు.[2]

మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. ఈనాడు.2025-08-15
  2. ఈనాడు. 2025-12-1