రవీంద్రనాథ్ ఠాగూర్
Wikiquote నుండి
రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7వ తేదీన బెంగాల్లో జన్మించాడు. ప్రముఖ కవి అయిన ఠాగూర్ 1913లో గీతాంజలి రచనకుగాను నోబెల్ బహుమతి పొంది ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. భారత జాతీయ గీతం "జనగణమణ" కూడా ఠాగూర్ రచించినదే. ఆగస్టు 7, 1941న ఠాగూర్ మరణించాడు.
.రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు:
- పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది.
- కాలం చెక్కిలిపై కన్నీటి చుక్క తాజ్మహల్.
- ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది.