విశ్వనాథ సత్యనారాయణ
స్వరూపం

విశ్వనాథ కులాబ్ధి విధుడు
ఆంధ్ర సారస్వతోద్యాన వన మధుడు
విశ్వనాథ సత్యనారాయణ(ఆంగ్లం: Viswanatha Satyanarayana) (1895-1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును [2].
విశ్వనాథ వ్యాఖ్యలు
[మార్చు]- తెలుగు అంటే తేనె మాటలు, కానీ ఆ తేనె వెనుక ఓ తపన ఉంది.
- సంస్కృతి అంటే నిఖార్సైన శ్రమ, నిబద్ధత, నియమ జీవనం!
- “కవిత్వం అనేది హృదయములోని జ్వాల — అది జ్ఞానంగా వెలుగుతుంది, భావంగా భాసిస్తుంది."
