దుందుభీ నది

వికీవ్యాఖ్య నుండి

దుందుభీ నది కృష్ణానదికి ఉపనది. ఇది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి, మహబూబ్ నగర్ జిల్లా గుండా ప్రవహిస్తూ, నల్గొండ జిల్లాలో కృష్ణానదిలో కలుస్తుంది.

దుందుభిపై వ్యాఖ్యలు[మార్చు]

చరియ సంధుల బుట్టి
చారలై కనుపట్టి
చీమ యూటగా మారి
చెలగి ధారల బారి
వడిగొనుచు గుమిగూడి
వాః ప్రవాహమ్ములై,
నురుగులై తరగలై
నునులేత మెరుగులౌ
పావనానంతగిరి ప్రకృతిసీమల నుండి
స్వాధు పానీయ సంపదలతో బొదలుచును
ప్రవహింతువా దుందుభీ మా సీమ
ప్రవహింతువా.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నవ వసంతం-3, తెలుగువాచకం, 8 వ తరగతి,(దుందుభీ-గంగాపురం హనుమచ్ఛర్మ),ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు,హైదరాబాద్,2013,పుట-1
  2. గోరటి వెంకన్న,w:బందూకు తెలుగు సినిమాకు రాసిన 'పూసిన పున్నమి వెన్నెల ' పాటలో...